25, డిసెంబర్ 2014, గురువారం


                           జాతీయ గణిత దినోత్సవం
                                 
శ్రీ శ్రీనివాస రామానుజం
 
మా పాఠశాలలో ఈనాటి జాతీయ గణిత దినోత్సవం ఆహ్లాదకర సుందర వాతావరణంలో మానూతన  ప్రధానో పాధ్యాయులు శ్రీ టి.వెంకట కుమార్ గారు నిర్వహించారు.సాయంత్రం సరిగ్గా 3.45 ని.లకు మా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధుల బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి శ్రీ శ్రీనివాస రామానుజం జయంతిని ఘనంగా జరుపుకున్నాం.గణిత నిష్ణాతులైన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెంకట కుమార్ గారు చక్కని ఉపన్యాస ధోరణితో శ్రీ రామానుజన్ జీవిత విశేషాలను విద్యార్ధులకు సమూలంగా అందించి ఈ సభను ఆకట్టుకున్నారు.వారి ఉపన్యాస సారాంశం............
               ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే రామానుజం జన్మ దినోత్సవాన్ని కెంద్రం జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడమే! రామానుజం వంటి మేధావి ఇప్పటికీ ఎవరూ పుట్టలేదన్నారు.రామానుజం తక్కువ కాలం జీవించినా,ఆకాశంలో మెరిసిన మెరుపు క్షణ కాలం ఉంటుంది. అది చాలా ప్రకాశవంతంగా వెలుగులీనుతుంది.అలాగే రామానుజంకూడా కొద్దికాలం మాత్రమే జీవించినా,ఎన్నో అద్భుతాలు సృష్టించాడు అని వివరించారు.ఎలా? ఎందుకు? అని ప్రశ్నిస్తే, శాస్త్రజ్ను లౌతారనీ,ఎప్పుడు?ఎక్కడ జరిగింది? అంటే చరిత్ర కారులౌతారన్నారు. రామానుజం చిన్నతనంలో పలకకుకూడా  నోచుకోక నేల మీదనే వ్రాసి చెరిపేవాడని,అందు మూలంగా అతని చేతులు కాయలు కాసేవని వివరించారు.ఎంతో కష్టపడి ట్యూషన్లు చెప్పిడబ్బుసంపాదించి చదువుకున్న అతి సామాన్యుడని చెప్పారు.టీచర్లు కూడా సాధించలేని గణిత సమస్యలను అతి సునాయాసంగా పరిష్కరించి చూపేవాడన్నారు. దీనికి అతని ఏకాగ్రత మూలకారణమని చెపుతూ,పిల్లలు అలాంటి ఏకాగ్రతను అందుకోవాలని సూచించారు.ఒక పీద్ద సమస్యని (లెక్కని) సులభ పద్ధతిలో కేవలం పది వరుసల్లో సాధించి చూపితే అది యే రీతిలో సాధించాడొతెలుసుకోవడానికి ఇతరులు తలలు పట్టుకొనే వారని వివరించారు.తన అభివృద్ధికి కారణం ఎప్పుడూ "నామగిరి దేవి" అని తమ కుల దేవతను ఎప్పుడూ తలుచు కునేవారు.గణితంలో చూపినంత శ్రద్ధ ఆరోగ్యం పట్ల చూపక పోవడం వల్ల అతనిని "క్షయ వ్యాధి" ఆవహించిందని వివరించారు.రామానుజన్ ను రాయల్ సొసైటీలో సభ్యత్వం వరించిందని, జె.సి.బోస్,మేఘనాధ్ సాహ,హోమీ బాబా,వంటివారు తర్వాత అందుకున్నారని తెలిపారు.శీతల దేశం కారణంగా ఇంగ్లండ్  లాంటి  దేశం వైద్యం అతనికి  సరిపడలేదు.ఇలాంటి  మేధావిని  కోల్పోతామా!అని హర్డీ కూడా ఎంతో  బాధపడేవారట.జబ్బు పడికూడా మంచంమీదనే గణిత సమస్యలను సాధిస్తూ వాటిని హర్డీకి పంపించేలా ఏర్పాటు చేసుకున్నారట. మద్రాసు విశ్వవిద్యాలయం అతని  జీవనం నిమిత్తం 250 పౌండ్లు  పంపగా ఇండియాలో నాకు 60 పౌండ్లు సరిపోతాయని,మిగిలినవి కుదిరితే బీదలకు,చిన్న పిల్లల ఆరోగ్యానికి పంపమన్న  త్యాగశీలి.                                               అలాంటి  మన శ్రీనివాస రామానుజన్ 1920 ఏప్రిల్ 26  న  పరమ పదించారని, రామానుజన్  మన దేశంలో  పుట్టీనందుకు మనం  గర్వపడాలని  తమప్రసంగాన్ని విరమించారు. అనంతరం మరొక గణిత  సహోపాపాధ్యాయులు శ్రీ తాతయ్య  మరికొన్ని  రామానుజం జీవిత విశేషాలను  తెలియజేశారు.జనగణమన తో ఈనాటి ఈ కార్యక్రమం ముగిసింది.                                              


                                 మా బడిలో స్వఛ్ఛభారత్