28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కృతజ్ఞుడు-కృతఘ్నుడు

కృతజ్ఞుడు అనగా చేసిన మేలు మరువని వాడు.అలాగే కృతఘ్నుడు అంటే చేసిన మేలు మరచిపోయేవాడు.మరి ఈ ఇద్దరికి భేదం తెలుసు కొనేలా ఒక కధ ఉంది                         
             ఒక ఊరిలో ఒక రాజు గారున్నారు.ఆయనని కొందరు కృతజ్ఞుడు అంటున్నారని, మరికొందరు కృతఘ్నుడు అనుకుంటున్నారని  చారులు తెలిపారు.రెండు పదాలూ ఇంచు మించు ఒకేలా మనందరికీ కనపడుతున్నా,అసలీ కృతజ్ఞుడు-కృతఘ్నుడు అనే పదాలకు అర్ధం ఆ రాజుకు మాత్రం సరిగా తెలవలేదు.తెలుసు కోవాలనే అతని మనస్సులో కుతూహలం.వేంటనే తన మంత్రిని కేకవేశాడు."నాకు ఈ రెండు పదాలకి అర్ధం సరిగా అర్ధం అయ్యేలా,ప్రత్యక్ష పూర్వకంగా రేపు నువ్వు! దీన్ని  నిరూపించడానికి ఆధారాలేమైనా తీసుకురా"అని ఆజ్ఞ జారీ చేశాడు. చిత్తం!మహ ప్రభో!అని పైకి అన్నాడేకాని,లోలోన కుములుతున్నాడు, ఏమి తేవాలో ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో అని.అదే ఆలోచనతో ఇంటికి వచ్చాడు.తెగ ఆలోచిస్తున్నాడు.ఆధారం ఏదీ ఎంత ఆలోచించినా దొరకలేదు.రేపు రాజు గారితో తన పనిఅయిపోయినట్లే!అని మనసులో కొంచెం భయం కూడా పట్టుకుంది.తల బ్రద్దలు కొట్టుకుంటున్నాడు.ఇలా ఉండగా ఆ మంత్రి గారికి ఎంతో తెలివైన ఒక కూతురుంది.తండ్రి డీలా పడి ఉండడాన్ని మొఖంలోనే గమనించి కారణం తెలుసుకుంది.                                          "ఓస్!ఇంతేనా!దానికి అంత తల కొట్టేసు కోసుకోవలసిన పనిలేదు.రేపు మన పెంపుడు కుక్కను,మీ అల్లుడు గార్ని రాజ సభకు తీసుకెల్లండీ!మీ సమస్య చాలా సులభంగా పరిష్కారం అవుతుంది" అని చెప్పి హాయిగా నిద్ర పొమ్మన్నది.
                                    మన మంత్రి గారికి,తన కూతురి ద్వారా అలా మంచి ఆధారం ఇంత సునాయాసంగా దొరకడంతో హాయిగా నిద్ర పోయాడు.మరునాడు ఎప్పటిలా తెల్ల వారింది.తన పెంపుడు కుక్కను, తన అల్లుణ్ణి,రాజ సభలో ప్రవేశపెట్టి ఇలా అన్నాడు."అయ్యా!మీరు తీసుకుని రమ్మన్నఆధారాలు తీసుకొని వచ్చాను"అన్నాడు.అక్కడకు తెచ్చిన ఆ ఆధారాలను చూసి,మంత్రి తనను ఎగతాళి చేస్తున్నాడని రాజు గారికి కోపం వచ్చింది.అప్పుడు మంత్రి,రాజుతో ఇలా అన్నాడు.....

                              "మహా రాజా!ఈ ప్రాణికి ఎంత పెట్టినా "సంతృప్తి" అనేదే లేదు. ఇతని దాహం తీరదు.విశ్వాసం లేదు. మహా రాజా!ఒక విధంగామీరూ,నేనూ కూడా ఒకప్పటి ఒక ఇంటి అల్లుళ్ళమే కదా!మన అత్త మామలు మనకు చేసిన మేలు అప్పుడే,మరచిపోయాము.మరి!ఈ కుక్కను చూడండి! ఇది మాత్రం ఏది పెడితే,అది తింది.ఎంతో విశ్వాసం తోఉంది.నేటికీ మన ఇంటికి కావలి కాస్తూనే ఉంది"అన్నాడు.
                          మంత్రి గారి సమాధానం ఆ రాజుకు చాలా బాగా నచ్చింది.ఇంత గొప్పగా చెప్పిన మంత్రిని ఎంతో ఘనంగాసత్కరించాడు. నిజానికి ఆ సన్మానం దక్క వలసింది తన కూతురుకేనని మనస్సులో భావించాడు ఆ మంత్రి.మనం పరులు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మరువకూడదని,అలాంటి వాడు కృతజ్ఞుడని,చేసిన మేలు కాస్తా మరచి పోయినవాడు
కృతఘ్నుడనీఆ రాజు ఈ విధంగా తెలుసు కోగలిగాడు. అలా అక్షరాల్లో కొద్ది తేడాతో కనపడుతున్నా ఈ రెండు పదాలకూ ఎంత భేదముందో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి