7, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలుగు మహా సభల సందర్భంగావివిధ పోటీలలో వి జే త లు

మండల స్థాయి కవితల పోటీలో గెలుపొందిన మాపాఠశాల చిరంజీవిని దేవాడ హరిత
పాలకొల్లు మండల స్థాయి పోటీల నిర్వహణను సమీక్షిస్తున్నమునిసిపల్  కమీషనర్,
మండల విద్యాశాఖాధికారి శర్మగారు,మరియు వివిధ పోటీల న్యాయనిర్ణేతల సమావేశం
ప్రపంచ తెలుగు మహాసభా నిర్వహణలో భాగంగా ఇటీవల మండల స్థాయిలో వ్యాస రచన,వక్తృత్వం,చిత్ర లేఖనం,పద్య పఠనం,స్వీయ కవితా రచన,మొదలైన పోటీలలో పాల్గొన్న మా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు.వీటిలో డి.హరిత 10వ తరగతి అమ్మాయి మండల స్థాయి కవితల పోటీలో ప్రధమ స్థానాన్ని పొంది,డివిజన్ స్థాయికి ఎంపిక కాబడింది.ఇది మా పాఠ శాలకు ఎంతో గర్వకారణమని ఇటీవలే నూతన ప్రధానోపాధ్యాయునిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన కుమార్ గారు మరియు ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం హరితను అభినందనల వర్షంలో ముంచెత్తారు.ఆ చిత్రాలివి.
చిరంజీవులు -సుకుమార్, పృధ్వి రాజ్, దుర్గ, దేవాడ హరిత, సునీత, హేమశ్రీ,  లక్శ్మీదుర్గ.