2, జూన్ 2013, ఆదివారం

ఎస్.చిక్కాల సమీప గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులారా ! గమనించండి !....అడుగు ముందుకు వెయ్యండి మరి!


మా పాఠశాల SMC సభ్యులతో ప్రధానోపాధ్యాయులు 
శ్రీ G.T.వెంకట కుమార్ గారి సమీక్షా సమావేశం
ప్
మా పాఠశాల విద్యా సంబరాలలో 11-14 సం.ల బాలబాలికలను చేర్పించ కోరుతూ మా ప్రగతిని తెలిపుతూ క్రొత్త విద్యార్ధినీ విద్యార్ధుల తల్లిదండ్రుల సమాచారానికై ప్రచురించిన కరపత్రం
 విద్యా సంబరాలలో  భాగంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మా పాఠశాల 95%సాధించిన ప్రగతిని,
ఆయా విద్యార్ధుల  GPA లను సగర్వంగా ప్రకటించుకుంటున్నాం!

1, జూన్ 2013, శనివారం

మంచి పిల్లలూ!......గురువు దేవునితో సమానమా?....... కాదా?.....

                     నిజానికి గురువు దేవునితో సమానం కాదు.
                  ఎందుకంటే!గురువు దేవుని కంటే ఎంతో గొప్పవాడు.
కేవలం దేవుడు నమ్మకంతో ముడిపడ్డాడు..మన శ్రీ గురువు కనుల ముందు కనుపించే మహనీయుడు.మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువుల ఋణం ఒక్కటే! అందువల్లనే "మాతృదేవోభవ""పితృదేవో భవ"అన్న తరువాత ఆచార్యదేవోభవ" అని చెప్పి గురువు స్థానాన్ని తెలియజేశారు.మన పూర్వీకులు. తల్లి,తండ్రి తరువాతస్థానం గురువుదే!దైవత్వాన్ని కూడా గురువు ద్వారానే దర్శించవలసి ఉంటుంది.
                         అజ్ఞాన తిమిరాంధస్య,జ్ఞానాంజన శలాకయా,
                         చక్షురున్మీలితంయేన తస్మైశ్రీ గురవేనమహ:.
అజ్ఞానమనే గ్రుడ్డితనాన్నిజ్ఞానమనే కాటుకనిచ్చి కనులు తెరిపించిన శ్రీ గురువులకు నమస్కారములు అని శ్లోకా
ర్ధమూ ,అదే లోకార్ధమూ కూడా!బ్రిటిష్ పాలకుల రాకతో గురు కులాలు,గురుకుల విద్యాభ్యాసాలు పోయాయి."మెకాలే దొర"విద్యా పద్ధతిలో గురు మర్యాదలు పూర్తిగా పోయాయి.పూర్వకాలం గురువుగారు కూర్చుంటే శిష్యులు నిలుచుండి పాఠాలు వినేవారు.ఇప్పుడు కాలి బూట్లతో శిష్యులు కూర్చుని ఉంటే గురువు గారు నిల్చుని పాఠాలు చెప్పాలి.
(దీనినే మెకాలే పద్ధతి"అంటారు.)
విద్య వ్యాపారమైంది ఈ నాడు.చదువుకునే వారు తగ్గిపోయారు. చదువుకొనే వారు రెచ్చిపోతున్నారు.ఎప్పుడైతే విద్యా బోధనకు విలువలు తగ్గి,విద్యాలయాలు వ్యాపార సంస్థలుగా మార్పు చెందాయో అప్పుడే గురువులు గుండ్రాయిలయ్యారు.నేడు గురువులు 'మాష్ట
రు' అయ్యారు.ఇప్పుడింకా మరి కొద్దిగా క్రిందకు దిగి 'సార్'లు అయ్యారు.
అయ్యో! గురువా!నీకెంత దుర్గతి పట్టిందయ్యా!
ఈ మార్పుకి కేవలం శిష్యులే కారణం కాదు.గురువులు కూడ ఎంతో కొంత కారణమవుతున్నారు.విద్యాలయాల్లో కూడా కులవివక్షను చూపిస్తున్నారు.వ్యాపార ధోరణిని ప్రదర్శిస్తున్నారు.ఇపుడు విద్యాలయాలు విజ్ఞాన నిలయాలు కావు.ఆర్జనా నిలయాలుగా మారి, బ్రతుకుదెరువు మార్గాన్ని మాత్రమే బోధిస్తున్నాయి.

                              "యధాగురు:తధా శిష్య:"
ఏది ఏమైనా గురుస్థానం గురువుదే కదా!గురువును దేవునిగా భావించి సాగిలపడి దండాలు పెట్టకపోయినా ఏనాడైనా,ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురుపడితే,అభిమానంగా పలకరించండి!గురువులు కోరుకొనేది ఇంతే!మనం గొప్పవాళ్ళమయ్యామని,ప్రయోజనపరులయ్యామని,వారికి తెలియజేసి చూడండి!హృదయ పూర్వకంగా ఎంత సంతోషిస్తారో!మీ కళ్ళతో మీరే చూడండి!ఏది ఏమైనా గురూపకారం మరువలేనిది అని మీరే గుర్తిస్తారు.అలాగే మనల్ని కన్న తల్లిదండ్రుల్నికూడా మరవకూడదు.వారి తర్వాతే గురువు మరి!

21, మే 2013, మంగళవారం

పాలకొల్లు మండలంలో ద్వితీయస్థానం


2012-13 వ సంవత్సరంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పాఠశాల విద్యార్ధి చి.కూనప రెడ్డి సాయి మణికంఠ పాలకొల్లు మండలంలో ద్వితీయస్థానాన్ని సంపాదించాడు.అలాగే మా పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 95శాతం సాధించడమే కాకుండా ర్యాంకుల్లో సాయి మణికంఠ 97.5,వీర నాగ మణికంఠ 9.దేవడ హరిత,భావన సునీత,సిద్దాని లక్ష్మీ దుర్గ,అడ్డగర్ల రాజు,నాగ పెద్దింట్లు 9కంటే అధికంగా ర్యాంకులు సాధించారని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము.

26, జనవరి 2013, శనివారం

పాఠశాలలో చదివే10వ తరగతి విద్యార్ధులకు పౌష్టికాహార పంపిణీ

విద్యార్ధినీ విద్యార్ధులతో గ్రామస్థుల ముఖాముఖీ
కార్యక్రమానికి ఆసీనులైన మా గ్రామ పెద్దలు,పౌష్టికాహార దాతలు

ప్రధానోపాధ్యాయులు వెంకట కుమార్ గారి సందేశం
పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్ధులకు సాయంత్రం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఇటీవలా మా చిక్కాల గ్రామస్థుల ఆర్ధిక సహకారంతో ప్రారంభించడం జరిగింది.కార్యక్రమానికి మా ఊరి దాతలు 1600/- రూపాయలు సహాయంగా ప్రకటించారు.99మం.విద్యార్ధి చదువుకు ఏ ఆటంకం లేకుండా చూడమని నూటికి నూరు శాతం ఉత్తీర్ణతా శాతం తీసుకు రావాలని మీకు మేము,మరియు ఉపాధ్యాయులు ఎల్లవేళలా సహకరిస్తామని గ్రామస్థులు తమ సందేశం ద్వారా వివరించి మీరు మనకీ మనఊరికీ ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులకు "పులిహోర"అందజేసి లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పాఠ శాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.టి.వెంకట కుమార్ గారు మా పాఠశాల విద్యార్ధులు మీకు కౄతజ్ఞతా పూర్వకంగా నూటికి నూరుశాతం ఉత్తీర్ణతను కానుకగా అందజేస్తామని గ్రామస్థులకు హామీ అందజేశారు.కష్టాలు ఎన్నో వస్తాయి.వాటిని తట్టుకుంటూ ముందుకు పోవాలని,రాబోయే కరెంటు కోతను దౄష్టిలో ఉంచుకుని బడిలో నిర్వహించే అదనపు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానో పాధ్యాయులు వివరించారు.గడచిన త్రైమాసిక పరీక్షలలో 60 శాతం ఉత్తీర్ణతను ఈ అర్ధ సంవత్సర పరీక్షలలో 75 శాతానికి తీసుకొని రాగలిగిన విద్యార్ధులను అభినందించారు.అలాగే ఈ గ్రాడు విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని,ఇదే ఉత్సాహంతో మరొక్క మూడు నెలలు కౄషిచేస్తే ఫలితాలు నూటికి నూరు శాతం తేగలమని వారి ఉపన్యాసంలో వివరించారు.
ఈ అభి వౄద్ధి సాధకులైన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ బృందానికి కౄతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమానికి ఆదరంతో హాజరై మా పాఠశాల క్రమక్రమాభి వౄద్ధిని లోకానికి అందజేస్తున్న పాత్రికేయ మిత్రులకు తమ అభినందనలు తెలియజేశారు.ఆ కార్యక్రమ చాయా చిత్రాలను మా విద్యార్ధులు,ఉపాధ్యాయులు దర్శించేలా ఉంచుతున్నాము.ఆనందించండి.
ప్రధానో పాధ్యాయుల సూచనలు,సలహాలు
గ్రామస్థులతో ప్ర.ఉ.పా వారి ప్రణాలికా చర్చలు

గణితోపాధ్యాయులు ఎస్.తాతయ్యగారి కృతజ్నతా సందేశములు
క్మశిక్షణతో వింటున్న విద్యార్ధి బృందం
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్న 
శ్రీ దాదరాజు గారు
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్నదాతలు
ప్ధానోపాధ్యాయుల వారి సమీక్షా సమావేశం

క్మశిక్షణతో వింటున్న విద్యార్ధినీ బృందం