26, జనవరి 2013, శనివారం

పాఠశాలలో చదివే10వ తరగతి విద్యార్ధులకు పౌష్టికాహార పంపిణీ

విద్యార్ధినీ విద్యార్ధులతో గ్రామస్థుల ముఖాముఖీ
కార్యక్రమానికి ఆసీనులైన మా గ్రామ పెద్దలు,పౌష్టికాహార దాతలు

ప్రధానోపాధ్యాయులు వెంకట కుమార్ గారి సందేశం
పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్ధులకు సాయంత్రం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఇటీవలా మా చిక్కాల గ్రామస్థుల ఆర్ధిక సహకారంతో ప్రారంభించడం జరిగింది.కార్యక్రమానికి మా ఊరి దాతలు 1600/- రూపాయలు సహాయంగా ప్రకటించారు.99మం.విద్యార్ధి చదువుకు ఏ ఆటంకం లేకుండా చూడమని నూటికి నూరు శాతం ఉత్తీర్ణతా శాతం తీసుకు రావాలని మీకు మేము,మరియు ఉపాధ్యాయులు ఎల్లవేళలా సహకరిస్తామని గ్రామస్థులు తమ సందేశం ద్వారా వివరించి మీరు మనకీ మనఊరికీ ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులకు "పులిహోర"అందజేసి లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పాఠ శాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.టి.వెంకట కుమార్ గారు మా పాఠశాల విద్యార్ధులు మీకు కౄతజ్ఞతా పూర్వకంగా నూటికి నూరుశాతం ఉత్తీర్ణతను కానుకగా అందజేస్తామని గ్రామస్థులకు హామీ అందజేశారు.కష్టాలు ఎన్నో వస్తాయి.వాటిని తట్టుకుంటూ ముందుకు పోవాలని,రాబోయే కరెంటు కోతను దౄష్టిలో ఉంచుకుని బడిలో నిర్వహించే అదనపు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానో పాధ్యాయులు వివరించారు.గడచిన త్రైమాసిక పరీక్షలలో 60 శాతం ఉత్తీర్ణతను ఈ అర్ధ సంవత్సర పరీక్షలలో 75 శాతానికి తీసుకొని రాగలిగిన విద్యార్ధులను అభినందించారు.అలాగే ఈ గ్రాడు విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని,ఇదే ఉత్సాహంతో మరొక్క మూడు నెలలు కౄషిచేస్తే ఫలితాలు నూటికి నూరు శాతం తేగలమని వారి ఉపన్యాసంలో వివరించారు.
ఈ అభి వౄద్ధి సాధకులైన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ బృందానికి కౄతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమానికి ఆదరంతో హాజరై మా పాఠశాల క్రమక్రమాభి వౄద్ధిని లోకానికి అందజేస్తున్న పాత్రికేయ మిత్రులకు తమ అభినందనలు తెలియజేశారు.ఆ కార్యక్రమ చాయా చిత్రాలను మా విద్యార్ధులు,ఉపాధ్యాయులు దర్శించేలా ఉంచుతున్నాము.ఆనందించండి.
ప్రధానో పాధ్యాయుల సూచనలు,సలహాలు
గ్రామస్థులతో ప్ర.ఉ.పా వారి ప్రణాలికా చర్చలు

గణితోపాధ్యాయులు ఎస్.తాతయ్యగారి కృతజ్నతా సందేశములు
క్మశిక్షణతో వింటున్న విద్యార్ధి బృందం
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్న 
శ్రీ దాదరాజు గారు
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్నదాతలు
ప్ధానోపాధ్యాయుల వారి సమీక్షా సమావేశం

క్మశిక్షణతో వింటున్న విద్యార్ధినీ బృందం